కర్నూలు: కర్నూలు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ ఎంపీటీసీలు ధ్రువీకరించిన కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్
కర్నూలు మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) వైసీపీకి చెందిన డి.వెంకటేశ్వరమ్మపై టీడీపీ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కర్నూలులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 13 మంది ఎంపీటీసీలు తీర్మానంపై సంతకం చేశారు. మెజారిటీ సభ్యుల తీర్మానాన్ని ఆర్డీవో సందీప్ కుమార్ ధ్రువీకరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సందీప్ కుమార్, ఎమ్మార్వో రమేష్బాబు పాల్గొన్నారు.