యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లోబరుచుకొని తల్లిని చేసిన రాజు అనే యువకుడిపై యాడికి పోలీసులు గురువారం రాత్రి పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక తన నాయనమ్మ ఊరైన మద్దికెర లో ఉంటున్నది. ఈ క్రమంలో పత్తికొండకు చెందిన రాజుతో పరిచయం ఏర్పడింది. ఆ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తల్లిని చేశాడు. సీఐ వీరన్న రాజు పై పోక్సో కేసు నమోదు చేశారు.