ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో సీఐ శ్రీనివాసరావు ద్విచక్ర వాహనదారులకు శుక్రవారం హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేదంటే జరిమానాలు విధిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్ల కలుగు నష్టాలు ప్రాణాల ముప్పు గురించి సీఐ వివరించి చెప్పారు.