ప్రకాశం జిల్లా కొండపిలో టిడిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం ఏపీ మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగింది. సందర్భంగా కొండేపి నియోజకవర్గంలో టిడిపి మండల కమిటీల ఏర్పాటు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అధిష్టానం నిర్దేశించిన విధంగా మండలాల వారీగా నాయకులను వారికి నామినేట్ పదవులను కల్పించారు. వారితో దామచర్ల సత్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా మండల కమిటీలలో స్థానం కల్పించుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.