అల్లిపురం సమీపంలోని సిరి గార్డెన్లో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. వారంతా సిరి గార్డెన్ కు చెందిన వారు కావడంతో... వారి మృతదేహాలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. తమ ప్రాంతానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన మంగళవారం సాయంత్రం వ్యాఖ్యానించారు..