శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి సమీపంలో మలుపు వద్ద ఫార్చునర్ కార్ అదుపుతప్పి బోల్తాపడడంతో కపిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.