నగరంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు, అనంతపురం వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వన్ టౌన్ పరిధిలోని అన్ని కాలనీలతో పాటు కేఫ్లలో స్నిఫర్ డాగ్ సహకారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా త్రీటౌన్ పరిధిలోని కేఫ్లు, టీవీ టవర్ ప్రాంతం, ఆర్టీవో ఆఫీస్ పరిసరాలు, హౌసింగ్ బోర్డ్, కలెక్టర్ ఆఫీస్, బుడ్డప్ప నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.