నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది, ప్రమాద దృశ్యాలు నేషనల్ హైవే పై ఉన్న సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి,నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న AR BCVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పగిలి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో బస్సు,కంటైనర్ రెండింటికీ మంటలు అంటుకున్నాయి,ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, లారీ క్లీనర్ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితికి చేరాయి, బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులను డీసీఎం డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట