చింతకుంట సమీపంలోని రోడ్లపైన ఆరబోసిన మొక్కజొన్నలు: పెరుగుతున్న ప్రమాదాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని చింతకుంట సమీపంలోని రోడ్లపై మొక్కజొన్న పంటలను రైతులు ఆరబెట్టుకునేందుకు పోయడంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, నేషనల్ హైవే లోని సర్వీస్ రోడ్డు వెంట, చింతకుంట చెరువు సమీపంలో మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు ఆరబోశారు, దీనివల్ల ఒకేవైపు వాహనాలు వెళ్లాల్సివస్తుంది, పంట నూర్పుడితో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు