కడప జిల్లా కమలాపురంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కమలాపురం ఏరియా కార్యదర్శి కోకటం షేక్ సాదిక్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 12 వరకు బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో భాగంగా 24న చేపట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.