చెంచు గూడెల్లో ఉండే గిరిజనులకు యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. కత్తులు, బాణాలు పెట్టుకుని ఉండడం చట్ట విరుద్ధమని, వాటిని వెంటనే దోర్నాల పోలీస్ స్టేషన్లో అప్ప జెప్పాలని హెచ్చరికలు చేశారు. మూడు రోజుల్లో అందుకు సంబంధించిన చర్యలు చేపడతామన్నారు. కాగా ఇటీవల పెద్ద మంతనాలలో అర్తి అంకన్నను అర్తి నాగన్న కత్తితో పొడిచి చంపిన నేపథ్యంలో శనివారం రాత్రి యర్రగొండపాలెం సీఐ ఈ హెచ్చరికలు చేశారు.