ప్రకాశం జిల్లా ఒంగోలులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రాజీవ్ నగర్ లో ఓ మహిళ సోమవారం తన భర్త ఇంటిముందు ఆందోళన చేసింది. 20 ఏళ్లనాడు వివాహం చేసుకున్న ఆమె తన భర్త మానసికంగా హింసించినట్లు ఆరోపించారు. తన పిల్లలను చూపకుండా, తనను ఆదరించకుండా భర్త చిత్రహింసలకు గురిచేశారని ఆమె వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు.