మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో గురువారం రాత్రి స్థానిక ఆర్టీవో మాధవరావు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు అంతేకాకుండా పండగ సమయంలో బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి ఎంత మొత్తంలో టికెట్లు ధరలు వసూలు చేస్తున్నారో ప్రయాణికుల వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే నిర్వహణ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీవో మాధవ రావు హెచ్చరించారు.