కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలంలో సోమవారం ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, తహసిల్దార్ సరస్వతి రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు అధికారులతో కలసి నేరుగా రైతులపొలాల వద్దకు వెళ్లి సాగునీరు, విద్యుత్, విత్తనాలు, ఎరువుల కొరత, గిట్టుబాటు ధరపై ఆరా తీశారు. వారు తెల్పిన సమస్యలు విని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు,సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.