భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్విజ్ పోటీల్లో ప్యాపిలి మండల కేజీబీవీ విద్యార్థిని హెచ్.లాస్య (10వ తరగతి) ద్వితీయ స్థానం సాధించింది. కలెక్టర్ రాజకుమారి, డీఈఓ జనార్దన్ రెడ్డి సమక్షంలో ఇవాళ విద్యార్థినికి సర్టిఫికేట్, మెడల్ ప్రదానం చేశారు. ఉపాధ్యాయురాలు జయలక్ష్మి, ప్రియాంక పాల్గొన్నారు. విద్యార్థిని విజయంపై ఎంఈవోలు వెంకటేశ్వర నాయక్, మహేశ్వర రెడ్డి అభినందించారు.