శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి మండలంలోని నడిమిపల్లి గ్రామ శివారులో అప్పుడే పుట్టిన చిన్నారిని మూడు రోజుల క్రితం వదిలి వెళ్లారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.