*జవహర్ నగర్ సమస్యలపై జిల్లా కలెక్టర్ ను కలిసిన వజ్రెష్ యాదవ్* మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ సర్కిల్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మంగళవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని మేడ్చల్ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ కలిసి, పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. జవహర్ నగర్ మీని భారత దేశంగా పిలువబడుతుందని ఇక్కడ 200 కాలనీల్లో విస్తరించిన జవహర్ నగర్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారని. గత 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారని అన్నారు.