గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రశాంతమైన జీవితం గడపాలని.. అనవసరంగా గొడవలకు పోవద్దని నెల్లూరు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.. జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం వారు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు.. ఆయా గ్రామాలలోని గ్రామస్తులు, గ్రామ పెద్దలతో మరియు యువతతో సమావేశం నిర్వహిస్తున్నారు.సైబర్ మోసాల గురించి, గాంజా, ఇసుక అక్రమ రవాణా గురించి చెబుతున్నారు. గ్రామాల్లో తగాదాలు, గొడవలు పడరాదని, అందరూ కలిసిమెలిసి సామరస్యంగా జీవించాలని గురువారం సూచించారు