తిరుపతి కలెక్టర్కు ధన్యవాదాలు.! ఏర్పేడు మండలం గుడిమల్లం దేవస్థానం బైపాస్ రోడ్డుకు రూ.2.30కోట్ల నిధులు మంజూరైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి రామచంద్రారెడ్డి, ఛైర్మన్ బత్తల గిరినాయుడు బుధవారం కలెక్టరు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయానికి, భక్తులకు ఎంతో ఉపయోగకరమైన ఈ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం స్పందించడాన్ని స్వాగతించిన అధికారులు త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.