కొండపి: తుఫాను కారణంగా సింగరాయకొండ మండలంలోని పాకాల, ఉల్లపాలెం ప్రాంతాలలోని ఉదృతంగా మారిన సముద్ర తీరం,
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల, ఉల్లపాలెం ప్రాంతంలోని సముద్రతీరం ఉగ్రరూపం దాల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం సముద్ర తీరం అల్లకల్లోలంగా కనిపించింది. అలల ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జాలర్లు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. అలల ఉధృతి అధికంగా ఉండడంతో ఈతకు ఎవరు వెళ్లకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.