జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలను అరికట్టడం, రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, నాలుగు చక్రాల వాహనాల్లో సీట్బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగం, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.