ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ కార్యాలయంలో వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్ధ పనితీరును సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని అధైర్య పడవద్దన్నారు.