పెనుకొండలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు వైపు వెళ్తున్న ఇన్నోవా కారు డివైడరు ఢీకొట్టి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గుడిబండ గ్రామానికి చెందిన గఫూర్, మీకులేశ్కు గాయాలయ్యాయి. ఎన్హెచ్ అంబులెన్స్ 1033 సిబ్బంది EMT నరసింహులు, పైలెట్ మహేశ్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు.