ప్రకాశం జిల్లా ముండ్లమూరు పట్టణంలోని ఉపాధి హామీ కార్యాలయం గాంధీ విగ్రహాల వద్ద సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. వ్యవసాయ ఉపాధి కార్మికుల వలసలు ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ మండల కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేయాలని లేనిపక్షంలో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు .