అనంతపురం జిల్లా పంపనూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మరో ద్విచక్ర వాహనం, వ్యక్తికి గాయాలు
Anantapur Urban, Anantapur | Oct 19, 2025
అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో పంపనూరు తాండ కి చెందిన శ్రీనివాసులు నాయక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.