లోక్ సభలో ఎంపీల ర్యాంకింగ్స్ లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి 11వ ర్యాంక్
Nandyal Urban, Nandyal | Sep 14, 2025
లోక్సభలో MPల పెర్ఫామెన్స్ రిపోర్ట్ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్లు ఇచ్చింది. ఈ నివేదికలో నంద్యాల MP బైరెడ్డి శబరి 11వ స్థానంలో నిలిచారు. ఆమె లోక్సభలో మొత్తం ప్రశ్నలు 78 అడగగా, 09 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆమె హాజరు శాతం 82.35గా ఉంది. మరి MP పని తీరుపై మీ కామెంట్..!