అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం కనంపల్లి వద్ద ద్విచక్ర వాహనం మదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తరిమెల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.