ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలోని సర్వే నంబర్ 105/2 స్మశానాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని సోమవారం స్థానిక తహసిల్దార్ కు ప్రజాసంఘాల నాయకులతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు విన్నతి పత్రాన్ని సమర్పించి ఫిర్యాదు చేశారు. స్మశానని కూడా వదిలిపెట్టడం లేదని కబ్జాకు పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు రావినూతల కోటి డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన తహసిల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.