సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం శివారులోని చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు ద గ్రేట్ అనంతపురం షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆదివారం రాత్రి షాపింగ్ ఫెస్టివల్ ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు ఆర్డీవో కేశవ నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు బాగా అవగాహన కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలను పూర్తిగా తగ్గించిందన్నారు.