ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో అగ్రహారంలో బుధవారం యలమందల మాల్యాద్రి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలంటూ నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.