ఫతేనగర్ రైల్వే స్టేషన్ లో పోలీసుల అప్రమత్తతతో ఓ మహిళ ప్రాణం నిలబడింది. మతిస్థిమితం లేని ఓ మహిళ పట్టాలపై సూసైడ్ అటెంప్ట్ చేసింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రాజు ఆమెను గమనించి పరిగెత్తుకుంటూ వెళ్లారు. పట్టాలపై ఉన్న మహిళను ట్రాక్ పక్కకు లాగి ప్రాణాలను కాపాడాడు. పోలీసు కానిస్టేబుల్ రాజు ధైర్యాన్ని, సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడినందుకు ప్రయాణికులు అభినందించారు.