శ్రీశైల మహాక్షేత్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఘోర తప్పిదం జరిగింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల చరిత్రలోనే తొలిసారిగా గ్రామోత్సవం నిలిచిపోయింది. రెండో రోజు జరగాల్సిన వాహన సేవ, గ్రామోత్సవాన్ని అధికారులు అర్ధాంతరంగా రద్దు చేశారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో, ఉత్సవమూర్తులు రాజగోపురం దాటి బయటకు రాలేకపోయారు.పురవీధుల్లో వైభవంగా సాగాల్సిన స్వామివారి ఊరేగింపును కేవలం ఆలయ ప్రాంగణానికే పరిమితం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కనీస ఏర్పాట్లు చేయడంలోనూ, రద్దీని నియంత్రించడంలోనూ దేవస్థానం విఫలమైందని భక్తులు మండిపడుతున్నారు. శ