ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ (RySS) ఆధ్వర్యంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిని నేతృత్వంలో జిల్లా స్థాయి లో ట్రైనీ ఐ.సి.ఆర్.పి లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిక్షణలో భాగంగా మూడవ రోజు క్షేత్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బృందం తొలుత టంగుటూరు మండలంలోని మిడమనూరు గ్రామంలో రైతు కాకుమాని మురళి సాగు చేస్తున్న ఏ-గ్రేడ్ శెనగ క్షేత్రాన్ని సందర్శించింది. అనంతరం రైతు విజయలక్ష్మి గారి పొలంలో ట్రైనీ ఐ.సి.ఆర్.పి లకు ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తూ, వారి చేతుల మీదుగా ఏ.టి.ఎం (Any Time Money) మోడల్ ఏర్పాటు చేయించారు.