జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో త్రిముఖ పోటీ ఉండబోతుందని అన్నారు.ఒకరు సానుభూతితో ఓట్లు అడుగుతున్నారు.మరొకరు అధికార దాహంతో ఓట్లు అడుగుతున్నారని అన్నారు.ఈ రెండిటి నడుమ న్యాయం ధర్మం కోసం పాటుపడుతుందని అన్నారు.లోపాయకారీ ఒప్పందం పెట్టుకునే చరిత్ర బీజేపీ ది కాదని తెలిపారు.ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే ప్రజలకు ఏమి లాభం ఉంటుందని ప్రశ్నించారు. మోసానికి ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గతంలో ప్రజలను మోసం చేసిన పార్టీ బిఆర్ఎస్ ది అని అన్నారు.