కలికిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ శాఖ పీలేరు డివిజన్ ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. పీలేరు డివిజన్లోని పలు పాఠశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.వీరికి ఇంధన పొదుపు పై క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఇంధన పొదుపు, సూర్యఘర్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిపి డి.ఇ దామోదర్, ఏడిఇ అమీర్ భాషా, కలికిరి మండల ఎంఈఓ-1 సురేష్ కుమార్, ఎంఇఓ-2 నాగార్జున్, వాల్మీకిపురం ఎంపిడిఓ మనోహర్ రాజు, ఎంజేపిఏపి పాఠశాల ప్రిన్సిపాల్ సోమశేఖర్ రెడ్డి,