ప్రజలందరూ దీపావళి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం వారు వేర్వేరు ప్రకటనలలో కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకైనా దీపావళి పండుగను ప్రజలందరూ కలిసి మెలిసి సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ ఏడాది వర్షాలు కూడా సమృద్ధిగా కురిశాయని పంట దిగుబడులు కూడా బాగా వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.