ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం సముద్ర తీరాన్ని అభివృద్ధి చేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సమావేశంలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. తుఫాను సమయంలో మత్స్యకారులకు అండగా నిలిచామని తెలిపారు. అంతేకాకుండా ఆక్వారంగాన్ని అభివృద్ధి చేస్తామని సముద్ర తీరాన్ని పర్యటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు.