ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించారు. జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పోలీసులు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించి వారికి వార్నింగ్ ఇచ్చినట్లు అలానే కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.