నంద్యాల పట్టణంలో మంగళవారం రాత్రి నడిగడ్డలో ఆసిఫ్ అనే యువకుడు పై జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేశామని నంద్యాల ఒకటవ పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసిఫ్ అనే యువకుడిని నలుగురు యువకులు బీరు బాటిల్లతో దాడి చేశారని,ఘర్షవర్డుతున్న యువకులను అడ్డుకుపోయిన బాధితుడు పై యువకులు దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన నలుగురిని 24 గంటల్లో అరెస్ట్ చేశామని చెప్పారు. దాడికి ఉపయోగించిన బీరు బాటిల్ రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు