ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 12న జరగబోయే ర్యాలీకి భారీ ఎత్తున తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుందన్నారు.