ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామ చెరువులో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. మధ్య ఆసియా మరియు సైబీరియా ప్రాంతాలలో అత్యధికంగా నివసించే స్టోన్ చాట్, కామన్ రోస్ పించ్ అనే పిచ్చుక జాతికి చెందిన పిచ్చుకలు కనువిందు చేస్తున్నాయి. శీతాకాలంలో చలిని తట్టుకోలేకపోవడంతో పాటు సంతాన ఉత్పత్తి కొరకు దక్షిణ భారతదేశానికి ఈ పక్షులు అత్యధికంగా తరలివస్తాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు.