విజయవాడ: దసరా ఉత్సవాలకు రండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆహ్వాన పత్రికను అందించిన కనకదుర్గమ్మ గుడి ఈవో సీనా నాయక్
ఈనెల 22 నుండి ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలకు రావాలని కనకదుర్గమ్మ దేవస్థానం ఈవో సీనా నాయక్ బృందం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన చాంబర్లో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.