కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలంలోని ఉస్తికాయల పల్లి గ్రామంలో ఈరమ్మ అనే మహిళపై ఆమె భర్త రంగారెడ్డి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. దీంతో ఆమెను గురువారం రాత్రి అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.