ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆదివారం మద్యం తాగి వాహనం నడిపిన వాహనదారుడుపై కేసు నమోదు చేసినట్లు సిఐ సురేష్ మీడియాకు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమాలతో పాటు ఇటీవల గిద్దలూరు కోర్టు వంద రోజులు కూడా జైలు శిక్ష విధించినట్లు వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రజలు సహకరించాలని మద్యం తాగి వాహనాలు నడపకుండా సురక్షితంగా తమ ఇళ్లకు చేరాలని వాహనదారులకు తెలిపారు.