సుప్రీంకోర్టు జస్టిస్ బి. ఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఎమ్మార్వో అంబటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. జస్టిస్ బీ. ఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.