మలికిపురం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు
కోనసీమ వ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. అమలాపురం కలెక్టరేట్ అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం, మలికిపురం మండలంలో అత్యధికంగా 70.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఐ. పోలవరం మండలంలో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 27.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.