మద్దులూరు ఎస్సీ కాలనీ పై డాక్యుమెంట్రీ తీస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మద్దులూరులో పర్యటించిన కలెక్టర్ రాజాబాబు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో ప్రజలు శుభ్రత పాటించడం పై ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కాలనీ పై డాక్యుమెంటరీ తీసి ప్రజలను చైతన్య పరుస్తామని అన్నారు. అలానే విద్యార్థులకు చేతుల శుభ్రత పై అవగాహన కల్పించాలని విద్యార్థులకు కూడా చక్కగా చేతులను శుభ్రం చేసుకునే అంశంపై అవగాహన కలిగి ఉన్నారని కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు.