భీమవరం: కాంగ్రెస్ కిసాన్ సేల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన
భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం 12:30 కు నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బోణం రవికుమార్, భీమవరం ఇంచార్జ్ అంకెం సీతారామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎమ్మార్పీ ధరలకే యూరియా ని అందించాలని అన్నారు. ఈ ప్రభుత్వం వల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.