రైతుల భూములను గత ప్రభుత్వం హయాంలో ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరిగిందని ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరి నియోజకవర్గం లో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరసింహారెడ్డి తో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశామని రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.