మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మొదటిరోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, టిడిపి జిల్లా అధ్యక్షుడు మరియు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో తొలి ఇన్చార్జి కలెక్టర్ గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మార్కాపూరం లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై ప్రకాశం జిల్లా తొలగించి మార్కాపురం జిల్లా వ్రాయించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోర్డులలో మార్కాపురం జిల్లా పేరు మార్చాలని ఆదేశించారు.